దేశంలో రైతుల ఉద్యమం రోజురోజుకీ హాట్ టాపిక్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు మార్చాలని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని మోడీ సర్కార్ పై ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. దేశంలో రైతు చేస్తున్న ఉద్యమం దేశంలోనే కాక ప్రపంచ స్థాయిలో అనేకమంది దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో మోడీ సర్కార్ నిదెబ్బ కొట్టాలని చూస్తున్న ప్రతిపక్షాలు.. రైతు చేస్తున్న ఉద్యమాన్ని వేదికగా చేసుకుని తీవ్ర స్థాయిలో బీజేపీ సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అయితే మోడీని పొలిటికల్ గా ఇరుకున పెట్టే రీతిలో కామెంట్ చేస్తున్నారు.
దీంతో ఏది చేసినా సరే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ తాజాగా సీరియస్ పోస్టు సోషల్ మీడియాలో పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా చట్టాలను రద్దు చేసే తరహాలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేయటం పట్ల మోడీ అసహనం చెందినట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది. మోడీ చేసిన ప్రకటన చూస్తే..జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి రోజులు వచ్చాయి అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో వృద్ధుల నుండి యువకులు వరకు పోలింగ్ లో పాల్గొనడం గ్రేట్ అన్నట్టు అభివర్ణించారు. అంత మాత్రమే కాక దేశంలో అందరూ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలని మోడీ పేర్కొన్నారు. అంత మాత్రమే కాక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత అతి తక్కువ కాలంలోనే జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు మేము జరిపితే… పాండిచెర్రి అనే కేంద్రపాలిత ప్రాంతంలో గతంలో ఉన్న ప్రభుత్వాలు కనీసం పంచాయతీ ఎన్నికలు కూడా జరప లేని పరిస్థితి. అటువంటి నాయకులు నాకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెబుతారా అంటూ ఇండైరెక్టుగా రాహుల్ గాంధీకి మోడీ డైలాగులు వేయడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.