పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. కమర్షియల్ సినిమా కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పూరి జగన్నాధ్ .. దాదాపు టాలీవుడ్ లో అందరి హీరోలతో బ్లాక్ బస్టర్స్ తీశాడు. హీరో ఎవరైనా పూరి జగన్నాధ్ సినిమాని తీసే సమయం మాత్రం 4 నెలలే. అన్ని అనుకున్నట్టుగా జరిగితే 5 వ నెలలో థియేటర్స్ లో బొమ్మ పడాల్సిందే. అంత స్పీడ్ సినిమా తీయడం లో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఉన్న డైరెక్టర్స్ లో పూరి జగన్నాధ్ తర్వాతే ఎవరైనా.
ఇక పూరి జగన్నాధ్ తో సినిమా చేయాలని దాదాపు అన్ని భాషల్లో ఉన్న స్టార్ హీరోల దగ్గర్నుంచి యంగ్ హీరోల వరకూ ప్రతీ ఒక్కరు ఎంతో ఆరాటపడుతుంటారు. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కూడా సినిమా తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అలాంటి పూరి కి కొంతకాలం బ్యాడ్ టైం నడిచింది. ఏ హీరో సినిమా చేసినా రిజల్ట్ బెడిసి కొట్టింది. కాని పూరి జగన్నాధ్ కి ఫ్లాప్ లు కొత్త కాదు. కాని హీరోలు మాత్రం పూరి కి వచ్చిన ఫ్లాప్స్ చూసి డేట్స్ ఇవ్వడానికి వెనకడుగు వేశారు.
అలాంటి సమయంలో పూరి కి ఎనర్జిటిక్ హీరో రాం దొరికాడు. ఇద్దరు ఆకలి మీద సింహాల్లాగా కసితో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశారు. ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే చాలామంది నెగిటివ్ గానే కామెంట్ చేశారు. కాని జస్ట్ టీజర్ తోనే అందరికీ షాకిచ్చారు రాం అండ్ పూరి. ఇస్మార్ట్ శంకర్ రిలీజై బ్లాక్ బస్టర్ కొట్టింది. ఊహించని సక్సస్ తో పూరి అండ్ రాం బౌన్స్ బ్యాక్ అయ్యారు. దాంతో డబుల్ ఇస్మార్ట్ శంకర్ అన్న టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు పూరి. కాని సినిమా మాత్రం మొదలవలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ – రాం కాంబోలో డబుల్ ఇస్మార్ట్ శంకర్ 2021 లో మొదలవబోతోందని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన పూరి – రాం డబుల్ ఇస్మార్ట్ తో ఎంత సంచలనం సృష్ఠిస్తారో చూడాలి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!