టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేవలం 2000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన గణేష్ ఐదేళ్లపాటు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలలో అయిన పై గణేష్ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఐదేళ్లపాటు నియోజకవర్గంలో తనదైన ముద్ర వేయలేకపోయారు. ఆయనపై భారీ అవినీతి.. ఇతర ఆరోపణలు లేకపోయినా అయ్యన్నతో పోలిస్తే నియోజకవర్గం లో ఏమాత్రం అభివృద్ధి లేదు.
అలాగని పెద్ద కాంట్రవర్సీలు కూడా లేవు. అయితే ఈసారి నర్సీపట్నంలో ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండనుంది. ఈసారి ఉమా శంకర్ గెలుపుపై మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప ఎఫెక్ట్ గట్టిగా ఉండేలా కనపడుతుంది. నర్సీపట్నంలో 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ముత్యాలపాప ఆ తర్వాత టిడిపిలోకి వెళ్లి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో ఆమె వైసీపీ టికెట్ ఆశించారు. అయితే జగన్ ఉమా శంకర్ గణేష్ కి టికెట్ కేటాయించారు. దీంతో పార్టీలో ఆమె అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు టిడిపిలో చేరిన కూడా ఆమెకు టికెట్ వచ్చే ప్రసక్తి లేదు.
అయితే ఈ ఎన్నికలలో ఆమె ఎలాగైనా పోటీ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను కాంగ్రెస్ నాయకులు సంప్రదిస్తున్నారు. ముత్యాల పాప కాంగ్రెస్లో చేరితే ఆమెకు టిక్కెట్ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె గెలిచినా.. గెలవకపోయినా కొంత ఓటు బ్యాంకు అయితే చీల్చేలా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు వర్సెస్ ఉమాశంకర్ గణేష్ మధ్య పోరు ఉండేలా కనిపిస్తోంది. 2014 ఎన్నికలలో కేవలం 2000 ఓట్ల తేడాతో అయిన విజయం సాధించారు. ఇప్పుడు ముత్యాలపాప చీల్చే ఓట్లు కచ్చితంగా అభ్యర్థుల గెలుపు ఓటములను తారుమార్రు చేసేలా అక్కడ వాతావరణం కనిపిస్తుంది.
ప్రస్తుతం ప్రతి ఒక్క ఓటు కీలకం అవుతుంది. దీనికి తోడు టిడిపితో జనసేన పొత్తు ఉండనుంది. గత ఎన్నికలలో జనసేన ఓట్లు కొన్ని ఉమాశంకర్ గణేష్ వైపు వెళ్లాయి. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముత్యాలపాప కూడా వైసిపికి పడే ఓట్లు కొన్ని చీల్చితే కచ్చితంగా ఉమా శంకర్ గణేష్ గెలుపు పై గట్టి ఎఫెక్ట్ పడుతుందని నర్సీపట్నంలో పొలిటికల్ చర్చ జరుగుతోంది. ఇంతకు ముత్యాలపాప ఎవరో కాదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణ దాస్ కు స్వయాన వియ్యపురాలు కావడం విశేషం.