నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసిపి పార్టీ అతనిని పట్టించుకోకపోయినా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలిచేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. తనకు సంబంధంలేని వ్యవహారాల్లో కూడా తలదూర్చి వైసిపి నేతలను టార్గెట్ చేసి విపరీతమైన విమర్శలు చేస్తున్న అతనికి అధికారపక్షం అతని భవిష్యత్తుపై పెద్ద హింట్ ఇచ్చేసింది. ఈ మధ్యకాలంలో జగన్ బాగా సక్సెస్ అయిన ఫార్ములానే రాజు గారి పైన వాడగా వెంటనే ఫలితం వచ్చేసింది.
తాజాగా వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ రఘురామకృష్ణంరాజు పై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర వ్యవహారాలతో కలగజేసుకోవద్దని.. సీఎం జగన్ లేకపోతే నువ్వు కనీసం ఎంపీగా గెలవలేని అసమర్థుడివని రాజుగారి పై విపరీతమైన కామెంట్లు చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పైన ఏ ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా సహించేది లేదని…. ఇంకా పోతే మూడు రాజధానుల విషయమై మరియు వైజాగ్ విషయమై కూడా అతనికి కామెంట్ చేసే హక్కు లేనేలేదని అవంతి మాట్లాడటం గమనార్హం.
రాజు గారిని తన పార్లమెంటు పరిధిలోని వ్యవహారాలకు తాను చూసుకోవాల్సిందిగా అవంతి హితవు పలికారు. అవసరమైతే రాజీనామా చేయి కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతటితో ఆగని అవంతి ఇలాగే పరిస్థితి కొనసాగితే చంద్రబాబు ఎలాగైతే విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రజల చేత అడ్డగించబడ్డాడో అలాంటి దుస్థితి ఏర్పడుతుంది అని వార్నింగ్ కూడా ఇచ్చాడు.
ఇక ఇందుకు ప్రతిగా రఘురామకృష్ణంరాజు నేను ప్రజల నాయకుడిని ఏమైనా మాట్లాడే హక్కు నాకు ఉంది అంటే జగన్ వ్యూహం బెడిసికొట్టేది. అయితే ఆయన మాత్రం నాకు పార్టీ అన్నా.. అధినేత అన్నా విపరీతమైన గౌరవం అని…. తాను ఎలాంటి రాజీనామా చేసే ఉద్దేశ్యంలో లేనని చెప్పడం తో వైసిపి వర్గాలు అన్ని రిలాక్స్ అయిపోయాయి. ఈ మధ్య కాలంలో తన నేతలతోనే ఏ వ్యవహారం అయినా నడిపిస్తున్న జగన్ రాజు గారి విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. పాపం బెదిరిపోయారో…. భయపడ్డారో…. ఇంకో దారి లేదు అని అయిపోయారో…. తన ఉద్దేశాన్ని బయటకు కక్కేసాడు.
ఇంక అంతే…. వైసిపి తనని పట్టించుకునేది లేదు.. రాజు గారు తాను అనుకున్నది సాధించేదీ లేదు. మహా అయితే రాజీనామానో అనర్హతో జరుగుతుంది. రెండిటిలో ఏది జరగకపోయినా అది ఇంకా ఘోరమైన పరిస్థితి. మరో నాలుగేళ్లు పవర్ లో ఉన్నా లేనట్టే…. దేనికి పనికి రాని పీఠాన్ని కిందేసుకొని వేసుకుని కూర్చోవాల్సిన రాజుగారు ముందు ప్రస్తుతానికి మిగిలింది అయితే ఏమీ లేదు.