దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తమ తరువాతి కార్యాచరణ ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకపక్క సరిహద్దులు మూసేసి అంతర్రాష్ట్ర రవాణాకు కొద్ది రాష్ట్రాలు సహకరించకపోగా ఇప్పుడు తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం తన రాష్ట్ర సరిహద్దులను వారంరోజులపాటు మూసివేసేందుకు నిర్ణయించింది.
ఆ రాష్ట్రంలో చాలా వేగంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా ఇకపై రాష్ట్ర సరిహద్దులు దాటాలి అంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. రాజస్థాన్ లో గత 24 గంటల్లో 123 కరోనా పాకిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,368 కి చేరింది.
ఇప్పటికే కోవిడ్-19 బారినపడి 256 మంది రాజస్థాన్ లో మరణించగా వారితో పాటు ఢిల్లీ మరియు హర్యానా రాష్ట్రాలు కూడా తమ రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయి.