జైపూర్(రాజస్థాన్) : గాయాలతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు చికిత్స చేయాల్సిన వైద్యుడే రౌడీగా మారి పేషెంట్ను చితక బాదిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన రాజస్థాన్లోని సవాయ్ మాన్సింగ్ (ఎస్ఎంఎస్) మెడికల్ కళాశాలలో జరిగింది.
ఆ డాక్టర్కు రోగి మీద ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ వార్డులో బెడ్పై పడుకున్న అతనిపై పిడిగుద్దులు గుద్ది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరో వైద్యుడు అతన్ని వారించి పక్కకు తీసుకువెళ్లాడు. ఒక యువకుడు ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఈ వీడియోపై రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ స్పందించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
వీడియో ఎఎన్ఐ సౌజన్యంతో…..
#WATCH: A resident doctor beat up a patient in Sawai Man Singh (SMS) Medical College in Jaipur, Rajasthan, yesterday. Raghu Sharma, Medical & Health Minister of Rajasthan says,' We have asked for a report on the video as to what really happened.' pic.twitter.com/9mU97nwif2
— ANI (@ANI) June 3, 2019