Food: వంట చేయడానికి ముందు తప్పక స్నానం చేసి ఉండాలి అనేది తప్పనిసరిగా పాటించవలిసిన కఠోర నియమము .
భోజనం Food చేసేటప్పుడు వంట బాగా లేదని కోపగించుకోవడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం వంటివి అస్సలు చేయకూడదు .
- ఆహారం పెట్టిన కంచం ఒడిలో కి తీసుకుని భోజనం చేయకూడదు . నిద్రపోయే మంచం మీద భోజనం చేయరాదు.
(ఇది వయసు మళ్ళిన వాళ్ళకి , అనారోగ్యం తో బాధ పడుతున్నవారికి వర్తించదు.) ఇంకా చెప్పాలంటే మాములు వారు మంచం మీద కూర్చుని మంచినీరు కూడా తాగకూడదు. - మాడినపోయిన అన్నాన్ని నివేదించడం ,అతిధులకు పెట్టడం లాంటివి చేయకూడదు.
- భోజనం చేసిన తర్వాత వెంట్రుకలు కత్తిరించడం లాంటివి చేయకూడదు.
- గురువులు, కానీ మహాత్ములు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మనం తినగా మిగిలిన ఆహారం వారికీపెట్ట కూడదు. వీరికోసం మళ్ళీ ప్రత్యేకంగా వండి వడ్డించాలి .
- భోజనం చేస్తున్నప్పుడు తింటున్న ఆహారం లో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం ఆహారాన్ని వదిలి పెట్టేయాలి .
- వంట వండేటప్పుడు ,ఆహారం తినేటప్పుడు భగవన్నామము తలుచుకుంటూ లేదా
భగవత్ కథలు వింటూ చేయడం చాలా ,చాల మంచిది అది మీ కుటుంబ ప్రశాంతతకు కారణమవుతుంది . - ఎంత ఆకలితో ఉన్న కూడా గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు .కొంత ఆహారం అందులో మిగల్చాలి.
- ఆహార పదార్థాలకు అస్సలు కాళ్ళు తగలకూడదు .
- భోజనం చేసేటప్పుడు నీళ్ళ గ్లాస్ కుడివైపు కు పెట్టుకోవాలి .
- ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు శ్రీ కృష్ణుడు ఎత్తాడని మహాభారతం తెలియ చేస్తుంది.
- కాబట్టి ఎంగిలి విస్తరాకులను తీసేవారికీ వచ్చే పుణ్యం అన్నం దానం చేసేవారికి కూడా రాదని శాస్త్రం చెబుతుంది.
- ఒకసారివండిన అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహారాన్ని మళ్ళీ వేడి చేసితినకూడదు.
ద్విపాక దోషం వస్తుంది. - స్త్రీలు గాజులు వేసుకోకుండా భోజనం వడ్డించరాదు.. తినరాదు.ఇవ్వన్నీ మంచి విషయాలు అందునా మన పెద్దలు ఏది చెప్పిన దాని వెనుక తప్పకుండ ఆరోగ్యపరమైన అంశాలు ఉంటాయని గుర్తు పెట్టుకోండి.