KRACK : మాస్ మహారాజా హీరోగా నటించిన ‘క్రాక్’ చిత్రం సంక్రాంతికి ముందు విడుదల అయి ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం 50% థియేటర్ ఆక్యుపెన్సీ తో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. నిన్నటి నుండి ‘ఆహా’ డిజిటల్ స్ట్రీమింగ్ ఆప్ లో కూడా రికార్డు స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా ను పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. రవితేజకు ఇది ఒక రకంగా బ్యాక్ ఫిలిం అని చెప్పాలి. ఈ సినిమా లో కమర్షియల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమాకు నిర్మాత ఠాగూర్ మధు అలసత్వం వలన తొలిరోజు సినిమా థియేటర్ లోకి వెళ్ళని విషయం తెలిసిందే. ఠాగూర్ మధు సమయానికి డబ్బులు చెల్లించలేదని కొందరు బయర్స్ కోర్టు వద్దకు వెళ్లగా ఈ సినిమా మొదటి రోజే విడుదల పోస్ట్ పోన్ చేస్తుంది. దాని వల్ల మొదటి రోజు వసూళ్లకు భారీ దెబ్బ పడింది. ఎలాగో హిట్ సాధించి సినిమా ఆ నష్టం నుండి బయటపడింది అనుకోండి అది వేరే విషయం. అయితే ఇప్పుడు మళ్లీ డబ్బుల విషయంలోనే ఈ సినిమా మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది.
ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తనకు రావాల్సిన మొత్తం ఇంకా రాలేదని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేశాడు. అంతేకాకుండా అసోసియేషన్ సభ్యులకు డైరెక్టర్ అగ్రిమెంట్, రైటర్ అగ్రిమెంట్ కూడా ప్రూఫ్ కింద ఇచ్చారు. తనకు ఇస్తానని అగ్రిమెంట్ చేసుకున్న డబ్బులు ఇంకా రాలేదని…. బ్యాలెన్స్ అమౌంట్ నిర్మాత తిరిగి చెల్లించాలని గోపిచంద్ కంప్లైంట్ చేయడం గమనార్హం.
ఠాగూర్ నుండి ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఈ చిత్రం భారీ హిట్ సాధించిన తర్వాత గోపీచంద్ మలినేనికి పెద్ద నిర్మాణ సంస్థల నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే తనకు ఈ సినిమాలో రావాల్సి రెమ్యునరేషన్ ఇంకా బ్యాలెన్స్ ఉందని గోపీచంద్ ఆధారాలను డైరెక్టర్స్ అసోసియేషన్ ముందు పెట్టడం ఇండస్ట్రీ లో లో పెద్ద వివాదానికే తెరలేపింది.