Sarkaru vari pata : సూపర్స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’. మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఫ్లస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. 2020 లో మాదిరిగానే మహేష్ బాబు ఈ సినిమాతో 2022 సంక్రాంతి బాక్సాఫీసు బరిలో దిగుతున్నాడు. మహేష్ బృందం ఎప్పుడో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఇక సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి తీసుకు వస్తున్నామని టాలీవుడ్ లో ప్రకటించిన మొదటి హీరో మహేష్ ఒక్కడే. గీత గోవిందం తర్వాత టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారిన పరశురామ్ పెట్లా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరగగా, ప్రస్తుతం హైదరాబాద్లో ఓ లాంగ్ షెడ్యూల్ జరుగుతుంది. దాదాపు నెల రోజులకి పైగా ఈ షెడ్యూల్ సాగనుంది. అయితే మహేష్ బృందం ‘సర్కారు వారి పాట’ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఇటు ఇండస్ట్రీ వర్గాలలోనూ, అటు అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ‘సర్కారు వారి పాట’ టైటిల్, ఇందులో నుంచి విడుదలైన మహేష్ బాబు ప్రీ లుక్ ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంది.
Sarkaru vari pata : మహేష్ బాబు ఎంట్రెన్స్ లుక్లో కనిపించనున్నారు.
అయితే తాజాగా సూపర్స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ నోటీస్ను ఈ నెల 31న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నారు. ఈ ఫస్ట్ నోటీస్లో మహేష్ బాబు ఎంట్రెన్స్ లుక్లో కనిపించనున్నారు. కాగా ‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటల రికార్డింగ్ పూర్తి చేశాడు థమన్. ఇక 2022 సంక్రాంతికి మహేష్ బాబుకి గట్టి పోటీనే ఉంది. అటు పవన్ కళ్యాణ్ – రానా సినిమా, ఇటు వెంకటేశ్ – వరుణ్ తేజ్ సినిమా కూడా రిలీజ్ కానున్నాయి. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ రాధే శ్యాం కూడా అప్పుడే వచ్చే అవకాశాలున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!