హరిద్వార్ లో సెక్యూరిటీ గార్డు అరెస్టు
హరిద్వార్: ఉత్తరాఖండ్ లోని పవిత్ర క్షేత్రం హరిద్వార్ లో ఘోరం జరిగింది. ఆరేళ్ల బాలికను చంపిన సెక్యూరిటీ గార్డు ఆ తర్వాత శవంతో సంభోగించాడు. అతడిని పోలీసులు అరెస్టుచేశారు. హరిద్వార్ లోని ఓ మురికివాడ సమీపంలపో తోటి పిల్లలతో కలిసి ఆడుకోడానికి వెళ్లి ఆ చిన్నారి అదృశ్యమైంది. నిందితుడు సోను సమీపంలోని పౌల్ట్రీఫాంలో పనిచేస్తాడు. అతడు ఆమెకు ఏదో ఆశ చూపి, దగ్గరలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేయబోయాడు. పాప గట్టిగా అరవడంతో ఆమె పీక నొక్కి చిత్రహింసలు పెట్టాడు. అతడి నేరాన్ని నిరూపించే కీలక సాక్ష్యాలు తాము సేకరించినట్లు హరిద్వార్ సీనియర్ ఎస్పీ జనమేజయ ఖండూరీ తెలిపారు.
పాపతో ఆడుకుంటున్న ఇతర పిల్లలు చివరిసారిగా సోనుతో చూసినట్లు చెప్పారని, అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించాడని ఖండూరీ అన్నారు. సాక్ష్యాలను బట్టి అతడే నేరం చేసినట్లు తేలిందన్నారు. తాగిన మత్తులో అలా చేసినట్లు భావిస్తున్నామన్నారు. సాక్ష్యాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని చెప్పారు. బాలిక తల్లిదండ్రులు యూపీలోని బిజ్నోర్ నుంచి వలస వచ్చి, అక్కడకు కేవలం 600 మీటర్ల దూరంలోని పొలంలో పని చేసుకుంటున్నారు. బాలిక మృతదేహం కనిపించిన తర్వాత సోనును అరెస్టు చేసినట్లు చెప్పారు. గార్డుతో పాటు మరొక వ్యక్తితో గత వారం తమకు గొడవ అయ్యిందని, తర్వాత ఇద్దరూ కలిసే ఈ ఘోరానికి పాల్పడ్డారని, అయినా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదో అర్థం కావడం లేదని బాలిక బంధువు ఒకరు అన్నారు.