YSRCP: కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ వైసీపీలో చేరారు. సెర్ప్ సీఈఓగా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్ స్వచ్చంద పదవీ విరమణ చేశారు. నిన్న ఇంతియాజ్ స్వచ్చంద పదవీ విరమణ దరఖాస్తును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి అందజేశారు.
ఈ వేళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్ప సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్ధిగా ఇంతియాజ్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూల్ మేయర్ బీవీ రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి లు పాల్గొన్నారు.
Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల