యుగాంతం రాబోతోంది, ఇక ఈ భూమి అంతమవుతుందని కొన్నేళ్లుగా వస్తున్న వార్తలు మనం చూసినవే. యుగాంతం వస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని సినిమాలు కూడా బాగానే చూపించాయి. అలాంటి ప్రమాదం నుంచి భూమిని చందమామనే కాపాడిందని నాసా పరిశోధనలో తేలింది.
చల్లని హాయిని పంచే చందమామకు సంబంధించి అమెరికా ఏజెన్సీ నాసా ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. ఇప్పటికీ 350 ఏండ్ల కిందట భూమిని చందమామే కాపాడిందని స్పష్టం చేసింది. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ భూమిపై జీవం ఉండటానికి ప్రధాన కారణం కూడా చందమామేనట. అదేలాగంటే ఒకప్పుడు చంద్రుడికి బలమైన మాగ్నెటిక్ ఫీల్డ్ (అయస్కాంత క్షేత్రం) ఉండేది.
అది సూర్యుని నుంచి భూమిపై పడే అతి ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడిందని నాసా పరిశోదనలో తేలింది.అప్పట్లో భూమిపై జీవరాశి ఇంకా లేదు. అంటే అది ప్రారంభ దశగా చెప్పుకోవచ్చు. అప్పటినుంచే చందమామ భూమిని కాపాడటం మొదలు పెట్టాడు. క్రీస్తు పూర్వం 410 కోట్ల ఏండ్ల నుంచి 350 కోట్ల సంవత్సరాల వరకూ.. చందమామ, భూమి రెండూ ఒకే అయస్కాంత క్షేత్రాన్ని కలిగి వున్నాయని నాసా తెలిపింది.
ఈ పరిశోధనలో తేలిన మరో విషయం ఏమిటంటే అప్పట్లో సౌర గాలులు చాలా ప్రమాదకరంగా ఉండేవని, వాటి నుంచి భూమిపై ఉండే వాతావరణం నాశనం కాకుండా చందమామకు చెందిన అయస్కాంత క్షేత్రమే కాపాడిందని నాసా చీఫ్ సైంటిస్ట్ జిమ్ గ్రీన్ తెలిపారు. ‘ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా… మేం వ్యోమగాములను చందమామపైకి పంపామని పంపాం. వాటి నుంచి చందమామ దక్షిణ ధ్రువం నుంచి కొన్ని శాంపిల్స్ తెచ్చారని వివరించారు. వాటిని పరిశోధించినప్పుడు ఈ విషయం తెలిసిందని ఆయన వివరించారు.
ఈ కొత్త పరిశోధనలో సరికొత్త విషయాన్ని కూడా తెలిపారు. చందమామపై ఒకప్పడు పవర్ ఫుల్ మాగ్నెటిక్ ఫీల్డ్ ఉండేదని తెలిపారు. భూమి చుట్టూ ఈ అయస్కాంత క్షేత్రం ఉండటం మూలంగానే యూరప్ దేశాలు, ఆర్కిటిక్ , అంటార్కిటిక్ ధృవాల్లో ఆకాశంలో రంగురంగుల అరోరాలు కనిస్తున్నాయని తెలిపారు. అయస్కాంత క్షేత్రం భూమిపై, చందమామపై ఎలా పనిచేస్తుందనే విషయాన్ని తెలుసుకోవడానికి సైంటిస్టులు కంప్యూటర్ మోడల్ ను తయారుచేశారు. దీని ద్వారా వారి పరిశోధను మరింత లోతుగా పరిశీలిస్తున్నారు.
320 కోట్ల ఏండ్ల నుంచి చందమామపై అయస్కాంత క్షేత్రం క్రమంగా తగ్గిపోతూ వస్తున్నది. 150 కోట్ల ఏండ్ల కిందట అది పూర్తిగా మాయమైంది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే చందమామ గనక మన భూమిని కాపాడకపోయుంటే ఇప్పటికే భూమి ఎప్పడో అంతరించి ఉండేదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.