S. P. Balasubrahmanyam: కొంత మంది గొప్పవాళ్లు మరణం తర్వాత ఎక్కువగా కీర్తించబడతారని చాలా మంది పెద్దలు చెబుతారు. ఆ విషయం ముమ్మాటికీ నిజం. లెజండరీ సింగర్ ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం కూడా అదే విధంగా మరణం తర్వాత కీర్తించబడుతున్నారు. తాను పద్మ అవార్డుకు ఎంపిక కావడమే ఇందుకు ప్రధాన కారణం. మరణించకముందు ఈ గౌరవానికి నోచుకోని బాలూ గారు మరణం తర్వాత అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.
కరోనా వల్ల వాయిదా..
అన్ని పరిస్థితులు చక్కగా ఉంటే.. ఎప్పుడో జరగాల్సిన అవార్డుల ఫంక్షన్ పద్మ శ్రీ కార్యక్రమం. కానీ కరోనా మనం అనుకున్న అన్ని విషయాలను తారుమారు చేసింది. రెండేళ్ల నుంచి ఈ అవార్డుల కార్యక్రమం జరగకుండా ఉంది కావున రెండేళ్లకు కలిసి ఒకేసారి నేడు రేపు కార్యక్రమాన్ని రాష్ర్టపతి భవన్ లో నిర్వహిస్తున్నారు. 2020 సంవత్సరానికి 141 మందికి, 2021 సంవత్సరానికి 119 మందికి పద్మ అవార్డులు వచ్చాయి. 2021 సంవత్సరం అవార్డులను రేపు ప్రధానం చేయనున్నారు. కాగా.. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు కేంద్రం పద్మ అవార్డులనిచ్చి సత్కరించనుంది.
పీవీ సింధును వరించిన పురస్కారం..
స్టార్ షట్లర్ రెండు సార్లు ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu) ను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. వెండి కొండ పీవీ సింధుకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో క్రీడాభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. పీవీ సింధుకు మామ్రమే కాకుండా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, అగ్రనటి కంగా రనౌత్ కు పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసి కేంద్ర సత్కరించింది. నిర్మాత ఏక్తా కపూర్, పాప్ సింగర్ అద్నాన్ సమీ, టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ లకు ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డులను ప్రధానం చేసింది. కాలం చేసిన రాజకీయ పండితులు, మాజీ మంత్రులు అరుణ్ జైట్లీకి పద్మ విభూషణ్, సుష్మాజీకి పద్మ భూషణ్ ప్రకటించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!