దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించిందని కొద్దిసేపటి వార్త బయటకు రావడంతో అందరిలో కంగారు మొదలైంది. ఆయన్ను ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై ఉంచారని ఎంజిఎం ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధించడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఎస్పీ తనయురాలు ఎస్పీ వసంత మాట్లాడుతూ నాన్న గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపింది. మధ్యాహ్నం కొద్దిగా విషమించిన మాట వాస్తవమేనని, అయితే మనందరి ప్రార్థనలతో ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని, కచ్చితంగా ఎస్పీ బాలు ఇంటికొస్తారని నమ్మకంగా తెలిపింది. మీ అందరి ప్రార్ధనలు, ఆ దేవుని ఆశీస్సులు, ఆయన విల్ పవర్ కచ్చితంగా త్వరలోనే కోలుకుంటారని తెలిపింది ఎస్పీ వసంత.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!