అమరావతి, మార్చి 14: సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు.
నరసరావుపేట ఎంపీ టికెట్ పై టీడీపీ అధిష్టానం నుండి స్పష్టమైన సంకేతాలు లేకపోవడంతో రాయపాటి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మధ్యాహ్నం సోదరుడు రాయపాటి శ్రీనివాస్ మరియు అనుచరవర్గం తో సమావేశం నిర్వహించారు. రాత్రి వరకు టికెట్ పై స్పష్టత రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా తెలియజేశారు.
చంద్రబాబుపై తనకు నమ్మకం కూడా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాయపాటి వైసీపీలో లో చేర్చుకొని సీటు ఖరారు చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తుంది.
రాయపాటిని బుజ్జగించేందుకు టీడీపీ నాయకత్వం చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేష్ స్వయంగా ఫోన్ చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ మీ మాట గౌరవిస్తుందని తెలియజేసినట్టు సమాచారం.
నరసరావుపేట పార్లమెంటు టికెట్ ఆయనకు కేటాయించడంతోపాటు కుమారుడు పేర్లు అసెంబ్లీ కి పరిశీలిస్తామని అధిష్టానం నుండి సమాచారం అందడంతో ఆయన అలకవీడిన తెలుస్తోంది.