(గుంటూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారికి స్పల్ప గాయాలు అయ్యాయి. ఆమె తన తెనాలిలోని తన నివాసంలో కాలు జారి కిందపడటం వల్ల తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు రాజుకమారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు నన్నపనేని రాజకుమారిని ఇంటికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటిలోనే చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నన్నపనేని రాజకుమారి ఇంట్లో కిందపడి గాయపడిన విషయం తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శిస్తూ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు.
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నన్నపనేని రాజకుమారి మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్ననన్నపనేని రాజకుమారి గత కొంత కాలంగా ఇంటికే పరిమితం అయ్యారు.