వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న టిక్ టాక్ యాప్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిaసిన విషయమే.. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల దాకా అందరూ దీని ఉపయోగించేవారున్నారు. అయితే గత కొంత కాలంగా చైనా యాప్ ల నిషేదం పై మన దేశంలో చర్చ జరుగుతూనే ఉంది. దీనిలో భాగంగానే చైనా యాప్ లు, వస్తువుల విషయంలో బైకాట్ చేసేస్తున్నారు. అందులో భాగంగానే ఇండియా చాలా చైనా యాప్ లను ఎత్తేసిన విషయం తెలిసిందే. ఇండియాలో టిక్ టాక్ యాప్ ఎత్తేయడం, మిగతా దేశాలు కూడా ఎత్తేయడంతో చైనా ఎంత నష్ట పోయుంటుందో తెలుసుకోవచ్చు. చైనా ప్రభుత్వం యాప్ ల ఎత్తివేతపై వేరే దేశాలతో చర్చిస్తున్నవిషయం తెలిసిందే.
దీనిలో భాగంగానే టిక్ టాక్ పై నిషేదాన్ని ఎత్తేస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. అనైతిక కంటెంట్ ను నియంత్రిస్తామని చైనా కంపెనీ హామీ ఇవ్వడంతో పాకిస్థాన్ టెలికాం అథారిటీ(పీటీఏ) టిక్ టాక్ ను అన్ బ్లాక్ చేసేసింది. స్థానిక చట్టాలకు అనుగుణంగా కంటెంట్ ను మితవాదం చేస్తామని హామీలు వచ్చాయని వెల్లడించింది. అశ్లీల, అనైతికతను వ్యాప్తి చేసే అన్ని ఖాతాలను బ్లాక్ చేస్తామని హామీ ఇవ్వడంతో పాకిస్థాన్ ప్రభుత్వం టిక్ టాక్ పై నిషేదాన్ని అన్ బ్లాక్ చేసింది.
అలాగే ఈ నెల ప్రారంభంలో ప్రజల నుంచి అసభ్యతకు సంబంధించిన వివిధ ఫిర్యాదులు వచ్చిన తరువాత పాపులర్ అప్లికేషన్ ను బ్లాక్ చేసినట్టు పాకిస్థాన్ నియంత్రణ సంస్థ పేర్కొంది. అయితే పాకిస్థాన్ లోని యూజర్లు తమ సర్వీసును యాక్సెస్ చేసుకోలేకపోవడం నిరాశకు గురిచేసిందని టిక్ టాక్ తాజాగా ఓ ప్రకటనలో వెళ్లడించింది.
గతం లో వీడియో షేరింగ్ అప్లికేషన్ లో అనేక సార్లు చెప్పినప్పటికీ అశ్లీల, అనైతిక విషయాల విషయంలో బ్లాక్ చేయడంలో విఫలమైందని పాకిస్థాన్ అథారిటీ ఆరోపించింది. అయితే వాటిని పూర్తిగా సరిదిద్దుతామని చైనా హామీ ఇవ్వడంతో పాకిస్థాన్ మళ్లీ టిక్ టాక్ ను అన్ బ్లాక్ చేసింది. కాగా భద్రతా పరమైన ఆందోళనలపై భారత్, అమెరికా ప్రభుత్వాలు ఈ యాప్ ను నిషేదించాయి.