ఎస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఇదే చర్చ తీవ్రంగా నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతల్లో చాలా మంది ఈ ఐదేళ్లలోనూ తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్నారు. అసలు వారికి సీట్లు ఇస్తే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాటు వారిని చిత్తుగా ఓడిస్తామని సొంత పార్టీ నేతలే శపథాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో కూడా చంద్రబాబు వారికే సీట్లు ఇచ్చారు. విచిత్రం ఏంటంటే అంత వ్యతిరేకత ఎదుర్కొంటూ కూడా టిక్కెట్ తెచ్చుకున్న ఆ ముగ్గురు కూడా లేడీ లీడర్లే కావడం విశేషం.
వాళ్ల ముగ్గురుకు పార్టీ నేతలు ఆల్ ద బెస్ట్ చెపుతుంటే.. వారు చిత్తుగా ఓడిపోతారని.. ఫైనల్గా చంద్రబాబుకు మూడు సీట్లు బొక్క అని పార్టీ నేతలు ఫీలవుతున్నారు. ఆ ముగ్గురు మహిళా నేతలు ఎవరో కాదు పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియతో పాటు పార్వతీపురం సీటు దక్కించుకున్న తోయక జగదీశ్వరి. నిజం చెప్పాలంటే పాయకరావుపేటలో అనితపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
అసలు ఆమెకు సీటు ఇస్తే గెలవదని గత ఎన్నికల్లోనే ఆమెను పశ్చిమగోదావరిలోని కొవ్వూరుకు పంపగా అక్కడ చిత్తుగా ఓడింది. ఇక ఇప్పుడు అనితకు సీటు ఇస్తే ఆమెకు సపోర్ట్ చేయం అని జనసేన నేతలే ఓపెన్గా చెపుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం ఆమెకే సీటు ఇచ్చారు. పొత్తు ఉన్న 2014లోనే ఆమె చచ్చీ చెడీ 2000 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు ఆమెకు అస్సలు సపోర్ట్ చేసేందుకు జనసేన, టీడీపీ కేడర్ ఏ మాత్రం సిద్ధంగా లేదు.
ఇక ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియపై ఎంత వ్యతిరేకత ఉందో తెలిసిందే. ఆమె భర్త భార్గవ్ చేసిన అవినీతి, అక్రమాలతో గత ఎన్నికల్లోనే ఆమెను ఆళ్లగడ్డ జనాలు చిత్తుగా ఓడించారు. పైగా ఆమెను కుటుంబ సభ్యులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి టైంలో చంద్రబాబు ఆమె గురించి అన్నీ తెలిసి కూడా ఆమెకే సీటు ఇచ్చారు. ఆళ్లగడ్డలో అఖిల అస్సలు గెలిచే పరిస్థితి లేదని టీడీపీ వాళ్లే చెపుతున్నారు.
ఇక చంద్రబాబు కురుపాంలో ఎవ్వరికి తెలియని తోయక జగదీశ్వరికి సీటు కేటాయించారు. మామూలుగా అక్కడ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీ వాణిపై కురుపాంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అక్కడ సరైన క్యాండెట్ను పెట్టుకుంటే టీడీపీకి గెలిచే స్కోప్ ఉండేది. అయితే చంద్రబాబు జగదీశ్వరికి సీటు ఇచ్చినప్పటి నుంచే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమెకు సీటు ఎనౌన్స్ చేయడంతోనే ఆమెను ఓడిస్తామని టీడీపీ కేడర్ శపథం చేస్తోంది.