వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని భావిస్తున్న టీడీపీ ఒకవైపు.. ఉన్న అధికారాన్ని పదిలం చేసుకుని మరింతగా పుంజుకోవాలని లెక్కలు వేసుకుంటున్న వైసీపీ మరోవై పు. ఈ రెండు పార్టీల్లోనూ టీడీపీ పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతున్నా.. ఆ పార్టీని లెక్కలోకి తీసు కుంటున్న విధానమే వైసీపీ వ్యూహానికి ప్రతీకగా మారింది. సో.. ఇక్కడ వైసీపీ, టీడీపీలను గమనిస్తే. మిత్ర పక్షంతో ఉన్నప్పటికీ.. వైసీపీని మించిన వ్యూహాలు వేయాల్సి ఉంటుంది.
వైసీపీకి బలమైన వలంటీర్ వ్యవస్థ ఉంది. టీడీపీ విషయానికి వస్తే.. జన్మభూమి కమిటీలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వాటిని సుప్త చేతనావస్తలో ఉంచారు. ఇక, వలంటీర్ వ్యవస్థ ద్వారా.. ఎన్నికల కోడ్ వచ్చే లోపే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ వైసీపీ అజెండాను మోసుకు వెళ్లాలని.. ఆ పార్టీ నిర్ణయించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు. అభ్యర్థులు కూడా వలంటీర్లను వెంటేసుకుని ప్రజల మధ్యకు వెళ్తున్నారు. వారిని కలుస్తు న్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు.
ఇక, ఇదే సమయంలో కొన్నికొన్ని చోట్ల కోడ్కు ముందే ప్రజలకు తాయిలాలు పంచుతున్నారు. చీరలు, ఆభరణాలు కూడా వైసీపీ నాయకులు ఇస్తున్నారు. ఇలా.. టీడీపీ, జనసేనలను పోలిస్తే.. ఆ పార్టీలలో ఇంత సీన్ కనిపించడం లేదు. కొన్నికొన్ని నియోజకవర్గాల్లో నాయకులు వెళ్లి ప్రజలను కలుస్తున్నా.. వారికి తాయిలాలు ఇవ్వడం లేదు. కానుకలు కూడా ఇవ్వడం లేదు. పైగా.. నాయకుడు కదిలితేనే.. టీడీపీ , జనసేనలకు ప్రచారం.
కానీ, వైసీపీ విషయంలో వలంటీర్ ఒక్కరు చాలు.. 50 ఇళ్ళకు.. 120 ఓట్లకు భరోసా వస్తోంది. ఇక, వైసీపీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు అయిపోయాయి. పోయిన వారు పోగా.. ఉన్నవారితోనే ముం దుకు సాగుతున్నారు. వీరు కూడా కలివిడిగానే ఉన్నారు. టీడీపీ -జనసేనల్లో ఇంకా ఇలాంటి అవగాహన రాలేదు. పొత్తులపై ఇంకా.. నాయకులు మనసు విప్పి మాట్లాడుకోని నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఇంకోవైపు.. ఇప్పుడు బీజేపీ కలిసింది. దీనిని నచ్చ జెప్పడంతోనే సమయం సరిపోతుంది.