వైసీపీ అధినేత ,ప్రస్తుత సీఎం జగన్ ని ఉద్దేశించి గతంలో టిడిపి వాయిదాల అబ్బాయి అంటూ గేలి చేసేది. ఫ్రైడే బాయ్ అంటూ ఎగతాళి చేసేది.
సిబిఐ గతంలో జగన్ పై దాఖలు చేసిన కేసుల్లో ఆయన విచారణ కి హాజరవడాన్ని ఈ విధంగా టిడిపి ఎద్దేవా చేస్తూ వచ్చింది.అయితే రోజులెప్పుడూ ఒకేలాగ ఉండవు కదా?ఇప్పుడు జగన్ పరిస్థితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు రాబోతున్న సూచనలు గోచరిస్తున్నాయి.ఎన్నో కేసులు ఉన్నప్పటికీ అన్నింటిలో స్టేలు తెచ్చుకుని ఇప్పటి వరకు కోర్టు మెట్లు ఎక్కని చంద్రబాబు ఇకపై వాయిదాలకు తిరగాల్సిందేనని న్యాయనిపుణులు చెబుతున్నారు.నిప్పునని,నిజాయితీకి పర్యాయపదాని ఆని చెప్పుకునే చంద్రబాబుకు గడ్డు రోజులు రాబోతున్నాయన్నారు.సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన కొన్ని తీర్పులు ఇందుకు దారి తీస్తున్నాయి.
ఏ కేసులోనూ స్టేల గడువు ఆరు నెలలకు మించి ఉండకూడదని సుప్రీం కోర్టు తీర్పిచ్చింది.అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీలపై నమోదైన కేసులపై వెంటనే విచారణ చేపట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో చంద్రబాబుపై పెండింగులో ఉన్న కేసులన్నీ ఒక్కొక్కటిగా విచారణ కి వస్తున్నాయి.ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాబు అక్రమార్జనకు పాల్పడ్డారని ఆయన అత్తగారు లక్ష్మీ పార్వతి 2005 లో వేసిన కేసు పదిహేనేళ్ల తర్వాత ఇప్పుడు విచారణకు వచ్చింది.అలాగే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ని బాబు ఆదేశాల మేరకు అప్పటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొనుగోలు చేయబోయిన ఓటుకు నోటు కేసు విచారణ కూడా ప్రారంభమైంది.
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులలో రోజువారీ విచారణ కూడా సోమవారం నుండి మొదలు కానున్నది!ఇవేగాకుండా బాబుపై దాఖలైన మరికొన్ని కేసులు కూడా కోర్టుల్లో విచారణకు రాబోతున్నాయని సమాచారం. ఇవన్నీ వరుసబెట్టి వస్తే ఇక చంద్రబాబు కోర్టుకి తిరగడానికి తప్ప టిడిపిని పట్టించుకునే టైం కూడా ఉండదు అని సెటైర్లు వినిపిస్తున్నాయి.ఏదేమైనా భూమి గుండ్రంగా ఉంటుంది బాబుగారూ అని వైసిపి నాయకులు కౌంటర్ వేస్తున్నారు!ఈ క్లిష్ట పరిస్థితులను బాబు ఏవిధంగా మేనేజ్ చేసుకుంటారో చూడాలి!