Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ “టికెట్ టూ ఫినాలే” టాస్క్ లో భాగంగా బిగ్ బాస్(Bigg Boss) ఏంటి సభ్యులకు పెడుతున్న గేమ్స్ చుక్కలు కనబడుతున్నాయి. ఐస్ బాక్స్ లో నించొవడంతో పాటు..టబ్ లో ఉన్న బాల్స్ పోకుండా కాపడుకోవడం.. పెద్ద సవాల్ గా మారింది. ఈ క్రమంలో ఇంటి సభ్యుల పాదాలకు భారీ ఎత్తున డ్యామేజ్ అయ్యింది. పింకీ(Pinky), సిరీ(Siri), షణ్ముక్(Shanmuk), శ్రీరామ్(Sri Ram) ఎక్కువగా ఐస్ డబ్బాలో ఉండటంతో.. మెడికల్ రూమ్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో శ్రీ రామ్ కాళ్ళకి… వేడినీటితో మసాజ్ చేయడంతో మరింత ప్రమాదకరమైంది. దీంతో రెండో టాస్క్ బెడ్ మీదే ఆడాడు. ఐస్ బాక్స్ లో నిలబడడం అనే టాస్క్ లో… చాలా వరకు గేమ్ లో సిరి నీ..సన్నీ కార్నర్ చేసినట్లు.. ఎపిసోడ్ చూసిన నెటిజన్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో హౌస్ లో… మానస్, కాజల్, సన్నీ కలిసికట్టుగా ఆడటంతో వాళ్లకి ఏమీ కాలేదని.. అంటున్నారు. ఇదిలా ఉంటే లీక్ వీరుల వార్తల ప్రకారం “టికెట్ టూ ఫినాలే” టాస్క్ లో విజేతగా మానస(Manas) గెలిచినట్లు వార్తలు వస్తున్నాయి.
మిగతా టాస్క్ లలో సేఫ్ గేమ్ ఆడుతూ… తనకు ఎవరు పోటీ లేకుండా చాలా తెలివిగా “టికెట్ టూ ఫినాలే” లో దూసుకు పోయినట్లు టాప్ ఫైవ్ లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో గ్యారెంటీగా టాప్ ఫైవ్ లో సన్నీ ఉండటం గ్యారెంటీ ఈ తరుణంలో కాజల్ వెళ్ళితే వీళ్ళ గ్యాంగ్ హవా.. చివరి దాకా కొనసాగటం గ్యారెంటీ అని తాజా వార్త పై నెటిజన్లు బిగ్ బాస్ ఆడియాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంకా కొద్ది వారాల ఆట మిగిలి ఉండటంతో హౌస్లో ఉన్న ఏడుగురిలో ఏ ఇద్దరు బయటకు వెళ్తారు అనేది ఉత్కంఠభరితంగా ఉంది.