ముంబాయి: శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్ననేపథ్యంలో కీలక బాధ్యతల నుండి తప్పుకున్నారు.శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్కు అప్పగించారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ ఆ పత్రిక కార్యనిర్వహక సంపాదకుడిగా ఉన్నారు. సామ్నా పత్రిక 1988లో బాల్ ఠాక్రే స్థాపించారు.
previous post