వీసా రహిత ప్రవేశం దాన్నే వీసా ఫ్రీ ఎంట్రీ అంటారు. అంటే వీసా లేకున్నా సరే.. కేవలం పాస్ పోర్ట్ ఉంటే చాలు.. కొన్ని దేశాల్లో భారత పాస్ పోర్ట్ హోల్డర్లు ప్రయాణం చేయవచ్చు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వీసా ఫ్రీ ఎంట్రీ దేశాల లిస్టును వెల్లడించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ రాజ్యసభలో దీనికి సంబంధించి ప్రకటన చేశారు.
వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్నికల్పిస్తున్న దేశాలు.. బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతీ, హాంకాంగ్, మాల్దీవులు, మారిషస్, మాంట్సెరాట్, నేపాల్, నియు ఐలాండ్, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, సమోవా, సెనెగల్, సెర్బియా, ట్రినిడాడ్ టొబాగో.. దేశాలు లిస్టులో ఉన్నాయి.
ఈ దేశాలకు వెళ్లాలనుకుంటే… ఎటువంటి వీసా అవసరం లేకుండా.. కేవలం పాస్ పోర్ట్ తో వెళ్లొచ్చు. అక్కడి అందాలను ఆస్వాదించవచ్చు.
వీసా ఫ్రీ ఎంట్రీతో పాటుగా.. వీసా ఆన్ అరైవల్, ఈ వీసా సౌకర్యాలను కూడా కొన్ని దేశాలు కల్పిస్తున్నాయని మంత్రి తెలిపారు.
43 దేశాలు.. వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని.. వాటిలో ఇరాన్, ఇండోనేషియా, మయన్మార్ లాంటి దేశాలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.
అలాగే ఈ వీసా సౌకర్యం కల్పిస్తున్న 36 దేశాలల్లో శ్రీలంక, న్యూజిలాండ్, మలేషియా లాంటి దేశాలు ఉన్నాయి.
కేవలం ఇండియన్ పాస్ పోర్టు ఉన్నా చాలు.. పైన తెలిపిన 16 దేశాలను తిరిగి రావచ్చు.