ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో చాలామంది ఫస్ట్ వచ్చిన అప్పటికంటే ఇప్పుడు బాగా కోలుకుంటున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం అరికట్టలేకపోతున్నారు. దీని వల్ల ఎక్కువగా ముసలివారు మరియు చిన్న పిల్లలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని దేశాలలో వైరస్ వ్యాప్తి తగ్గిందని లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత అనూహ్యంగా ఊహించని విధంగా పరిస్థితిని కంట్రోల్ చేయలేని విధంగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడటంతో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామంతో ఆర్థికంగా అనేక నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో ఈ మహమ్మారి కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ఒక్కటే విరుగుడు అని, మొత్తం దేశాలు ఎదురు చూస్తున్నాయి. ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు అధ్యాపకులు పేరుగాంచిన యూనివర్సిటీల బోధకులు కరోనా వైరస్ విరుగుడు కనిపెట్టడం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు సరైన స్పష్టత వ్యాక్సిన్ విషయంలో రాలేదు. ఇటువంటి విషయంలో బంగారం లాంటి వార్త వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థకు చెందిన ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెప్పుకొచ్చారు. ఈ యేడాది డిసెంబరు కల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం తో WHO ఉన్నట్లు ఆమె వెల్లడించారు. కరోనాకు అడ్డుకట్టే వేసే క్లినికల్ ట్రయల్స్కి సంబంధించిన ఓ ప్రయోగం మూడో దశకు చేరుకున్నట్లు సౌమ్య తెలిపారు. ఇదే టైములో కరోనా విషయం లో గేమ్ చేంజర్ అని పిలవబడుతున్న హైడ్రాక్సిక్లోరోక్విన్ మెడిసిన్ పెద్దగా ప్రభావం చూపటం లేదని సౌమ్య తెలిపారు.