Rashmika mandanna: హీరోయిన్స్ అందరూ ఒక సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంటే మిగతా ఇండస్ట్రీలలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. అయితే అలా అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్స్ అందరికీ ఆయా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ రావచ్చు.. రాకపోవచ్చు. అది ఇండస్ట్రీలో ఆమె ఎంచుకునే సినిమాలను బట్టి అక్కడ ప్రేక్షకులు ఆదరించే దానిని బట్టి ఉంటుంది. అన్నీ ఇండస్ట్రీస్లో క్రేజీ హీరోయిన్గా వెలుగుతున్న హీరోయిన్స్ ఇప్పుడు చాలా తక్కువమందే ఉన్నారు.
కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. ఈ సినిమా కన్నడలో మంచి హిట్ సాధించింది. దాంతో రష్మిక మీద టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య, దర్శకుడు వెంకీ కుడుమల కళ్ళు పడ్డాయి. వారి సినిమాకు రష్మిక కరెక్ట్ అనుకున్నారు. దాంతో ఛలో సినిమాలో ఆమెను హీరోయిన్గా ఎంచుకున్నారు. రష్మిక అదృష్ఠం కొద్దీ తన తెలుగు డెబ్యూ సూపర్ హిట్గా నిలిచింది. దాంతో నాని పక్కన దేవదాస్ సినిమా, విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో హీరోయిన్గా నటించే అవకాశాలు అందుకుంది.
Rashmika mandanna: హిందీ ఇండస్ట్రీ మీదనే రష్మిక మందన్న బాగా ఫోకస్ చేస్తోంది.
వీటిలో గీత గోవిందం బ్లాక్ బస్టర్ అవడంతో మిగతా రెండు సినిమాలు ఫ్లాపయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ క్రేజ్ వల్లే ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్గా, సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్పలో ఆ తర్వాత శర్వానంద్ సరసన ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలలో అవకాశాలు అందుకుంది. వీటిలో సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ కావడంతో రష్మిక క్రేజ్ సౌత్ మొత్తం పాకేసింది. అలా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కార్తీ నటించిన సుల్తాన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది.
ఈ సినిమా అంత భారీ హిట్ కాకపోయినా రష్మిక తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇంకా తెలుగులో పుష్ప సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్తో రష్మిక బాగానే ఆకట్టుకుంది. ఇక శర్వానంద్ సరసన నటిస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఫస్ట్ లుక్ వచ్చి బాగానే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. చూస్తుంటే తెలుగులో అమ్మడికి పాన్ ఇండియన్ హీరోయిన్గా క్రేజ్ దక్కడం ఖాయం అనిపిస్తోంది. అయితే ఇప్పుడు తెలుగు కంటే హిందీ ఇండస్ట్రీ మీదనే రష్మిక మందన్న బాగా ఫోకస్ చేస్తోంది.
Rashmika mandanna: రష్మిక నటించిన ఒక సినిమా రిలీజ్ అయితే గానీ అక్కడ తన సత్తా ఏంటనేది తెలుస్తుంది.
అక్కడ అమితాబ్ బచ్చన్ కూతురుగా గుడ్బై సినిమాను చేస్తోంది. ఇక ఇప్పటికే ‘మిషన్ మజ్ను’ సినిమాను పూర్తి చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ సినిమా 2022 మే 13న రిలీజ్ కాబోతుంది. శంతను బాగ్చి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, బాలీవుడ్ స్టార్ మేకర్స్ రోనీ స్క్రూవాలా అమర్ బుటాలా, గరిమా మెహతాతో కలిసి నిర్మిస్తున్నారు. అయితే రష్మిక టాలీవుడ్ తప్ప కోలీవుడ్లో అంతగా అవకాశాలు అందుకోలేపోతోంది. అలాగే ఆమె ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన వారు అక్కడ అంతగా రాణించలేరనే టాక్ ఉంది. రష్మిక నటించిన ఒక సినిమా రిలీజ్ అయితేగానీ అక్కడ తన సత్తా ఏంటనేది తెలుస్తుంది.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!