హైదరాబాద్: షాద్నగర్లో దారుణ సంఘటన చోటుచేసుకున్నది. ఒక మహిళా వెటర్నరీ డాక్టర్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
నిన్న సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన పశువైద్యాధికారిణి ప్రియాంక రెడ్డి ఉదయం దహనమై కనిపించడం సంచలనం రేపింది. ట్రీట్మెంట్ కోసం నిన్న సాయంత్రం మాదాపూర్లోని ఓ ఆసుపత్రికి వెళ్లిన ప్రియాంక రెడ్డి తిరిగి వచ్చే సమయంలో తన స్కూటీ టైర్ పంక్ఛర్ అయిందని సోదరికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. బైక్ ఆగిపోయిన ప్రదేశంలో చుట్టుపక్కల లారీ డ్రైవర్లు ఉన్నారనీ, తనకు భయమేస్తోందనీ ఆమె చెల్లికి ఫోన్లో చెప్పినట్టు సమాచారం. రాత్రంతా ప్రియాంక ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి శ్రీధర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
షాద్నగర్ సమీపంలో ఓ యువతి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉందని గుర్తించిన పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతురాలి తండ్రి శ్రీధర్ రెడ్డి ఆ మృతదేహాన్ని పరిశీలించి తన కుమార్తె ప్రియాంక రెడ్డిదేనని గుర్తించారు.
ఈ ఘటనపై దర్యాప్తునకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు టీమ్లను రంగంలోకి దింపారు. ప్రియాంక రెడ్డిని లారీ డ్రైవర్లే హత్య చేశారా లేక ఆమెను మరెవరైనా హత్య చేశారా అనే కోణంలోనూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.