ఢిల్లీ: కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ పంపుతూ దాన్ని మీడియాకు విడుదల చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు అధికార టిడిపి ఉద్దేశపూర్వకంగా ఆటంకం కల్గించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేయాలని విజయసాయి రెడ్డి కోరారు. అధికార పార్టీ కౌంటింగ్ ఏజంట్లు నకిలీ ఫారం 17 తీసుకువచ్చే అవకాశం ఉందనీ వాటిపై ఇసి హెచ్చిరికలు జారీ చేయాలని కోరారు.
కౌంటింగ్ జరిగే వరకూ ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్ హాలులోనే ఉండాలనీ, లేని పక్షంలో రిటర్నింగ్ అధికారులపై అధికార పార్టీ ఏజెంట్లు ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
కౌంటింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ ముందుగానే పూర్తి చేయాలని విజయసాయి రెడ్డి కోరారు. అదే విధంగా కౌంటింగ్ కేంద్రాలలో ఈవిఎంల వద్ద మెష్తో పాటు స్టీల్ బారికేడ్లు కూడా ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.