YS Sharmila Party : మొన్నటి వరకు చాలా సైలెంట్ గా ఉన్న లోటస్ పాండ్ ప్రాంతం ఇప్పుడు వైసిపి అభిమానులతో మద్దతుదారులతో సందడి వాతావరణం నెలకొంది. కారణం షర్మిల కొత్త పార్టీ YS Sharmila Party పెట్టడానికి రెడీ అవ్వడం. దీంతో ఫిబ్రవరి 9 అనగా ఈరోజు దివంగత వైఎస్ పెళ్లి రోజు కావడంతో ఈ శుభదినాన వైసిపి మద్దతుదారులతో మరియు అభిమానులతో షర్మిల భేటీ అయి తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు తీసుకొస్తా అని గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకో బోతున్నామని స్పష్టం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే దాదాపు ఈ ముప్పై రోజులు తెలంగాణ వ్యాప్తంగా యాభై వేల మంది తో 40 రోజులు… మార్చి నెలాఖరు వరకు చర్చలు జరపడానికి షర్మిల రెడీ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పెడితే పరిస్థితి ఏంటి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న దాని విషయంలో పలు సూచనలు తీసుకోవడానికి.. తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నాయకులు వైయస్ రాజశేఖర్రెడ్డి ఆత్మీయులు అభిమానులు అదేవిధంగా అప్పట్లో రాజశేఖరరెడ్డితో కలిసి రాజకీయాలు చేసినా నాయకులు సీనియర్లు జూనియర్లు ఇలా అందరితో కలిపి 50 వేల మందితో చర్చలు జరిపి సూచనలు తీసుకోవడానికి వీరిలో కొంతమందితో అంతరంగికంగా కూడా సమావేశం అవటానికి షర్మిల రెడీ అయినట్లు ఈ చర్చలు మొత్తం మార్చి నెలాఖరు వరకు జరగనున్నట్లు సమాచారం.
ఈ విధంగా సూచనలు తీసుకున్న తర్వాత కొత్త పార్టీ ప్రకటనకు లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటానికి షర్మిల అండ్ టీం ఏర్పాట్లకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదే తరుణంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ బోర్డుకి “వైయస్సార్ టిపి” అనే పార్టీ పేరును సిఫార్సు చేస్తూ అప్లికేషన్ కూడా అప్లై చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద పక్క ప్లానింగ్ తోనే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం, అటు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా పూర్తిగా తగ్గిపోవడంతో షర్మిల కొత్త పార్టీ ప్లాన్ సూపర్ అని, ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల కొత్త పార్టీకి ఆదరణ రావడం గ్యారంటీ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది కీలక నేతలు షర్మిల పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.