YS Sharmila: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవేళ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు కు బహిరంగ లేఖ రాశారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేక హోదా అంశంపై జగన్, చంద్రబాబుకు లేఖ రాశారు వైఎస్ షర్మిల. ఏపీ విభజన హామీల అమలు అయిదున్నర కోట్ల ఆంధ్రుల హక్కు అని షర్మిల అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా వీటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తొందని ఆమె విమర్శించారు. కేంద్రానికి విభజన హామీలను గుర్తు చేస్తూ పోరాటం సాగించాలని చెప్పారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా పై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని లేఖలో ఆమె కోరారు.
తన లేఖలో తమ డిమాండ్లను మీ ముందుంచామని చెప్పారు. మీమీ పార్టీల తరపున అసెంబ్లీ వేదికగా చర్చించాలని అన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరం చేయాల్సిన పోరు అని షర్మిల చెప్పారు. ఇటీవల షర్మిల ఢిల్లీలోనూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల .. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే..?