ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇటీవల రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కి లెటర్ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని లా అండ్ ఆర్డర్ సరైన రీతిలో అమలు కావడం లేదని, జరుగుతున్న పలు ఘటనలపై నిర్భయంగా పోలీసులు వ్యవహరించి చర్యలు తీసుకోవాలని గతంలోనూ ఇటీవల చంద్రబాబు లేఖలు రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాసిన లెటర్ లపై అనేకసార్లు స్పందించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్… మరోసారి తాజాగా ఇటీవల స్పందించారు.
చంద్రబాబు అవాస్తవాలతో లెటర్లు రాస్తున్నారని… లెటర్ లో ప్రస్తావించిన విషయాలపై విచారణ జరిగితే ఆరోపణలు అన్నీ అవాస్తవాలే అని తేలుతున్నట్లు గౌతమ్ సవాంగ్ షాకింగ్ కామెంట్ చేశారు. కేవలం పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవటం అనే అజెండాతో చంద్రబాబు లెటర్ రాస్తున్నట్లు ఏపీ డీజీపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం పోలీసులను వివాదాల్లోకి లాగాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. ఓ మతం పేరు చెప్పి దేవాలయాలపై దాడులు అనే పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసిన వారిపై చర్యలు కూడా తీసుకున్నట్లు ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
అంతేకాకుండా కంప్లైంట్ చేసేవాళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ దాకా రాకుండా వాట్సాప్ ద్వారా కంప్లైంట్ చేసిన కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా శాంతిభద్రతలను విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే ప్రకాశం జిల్లా పోలీసులు టెక్నాలజీ వాడకంలో ముందున్నారని వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా జిల్లా పోలీసులు రాణించాలని చెప్పుకొచ్చారు. అదేవిధంగా సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నట్లు స్పష్టం చేశారు.