అమరావతి: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని హిందువుల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ దుమారం రేగుతోంది. నానిపై కేసు నమోదు చేయాలంటూ బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో డిక్లరేషన్ విషయంపై మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని వారు పేర్కొంటున్నారు.
‘తిరుపతి గుడి నీ అ_ మొ__ కట్టించాడా, ఎవడికి సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో జన్మించిన వైఎస్ జగన్ ఏ దేవాలయానికైనా, మసీదుకైనా, చర్చి కైనా వెళ్లే హక్కు ఉంది’ అంటూ మంత్రి కొడాలి నాని మాట్లాడిన విషయం తెలిసిందే. నాని మాట్లాడిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి నానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో బిజెపి నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు.