Bandla Ganesh Roja: సినీ నటుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి రోజాకి అసలు పడదు అన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరు ఓ ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ డిబేట్ లో బండ్లగణేష్ కూర్చున్న సమయంలో ఫోన్ కాల్ ద్వారా రోజా మాట్లాడుతున్న తరుణంలో ఇద్దరి మధ్య గట్టిగా గొడవ జరిగింది. నువ్వానేనా అన్నట్టుగా ఇద్దరూ ఘాటైన కామెంట్ లతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి బండ్ల గణేష్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఫస్ట్ టైం రోజా పై బండ్ల గణేష్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజాకి సినిమా ఇండస్ట్రీ తరఫున సన్మానం చేయాలని అన్నారు. ఎమ్మెల్యే గా రెండు సార్లు ఓడిపోయి ఆ తర్వాత రెండు సార్లు గెలిచి రోజాకి మంత్రి పదవి రావటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి పై బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా వ్యక్తి పై కోపం ఉంటే ఆయనే విమర్శించాలి తప్ప కులం పేరుతో విమర్శించకూడదు అని సూచించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా గాని ఇంకా కులం పేరుతో దూషించడం ఏమిటని ప్రశ్నించారు. టిడిపి ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్న అన్నమాట సరికాదని.. వివిధ కులాలకు చెందిన నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ తన అన్నయ్య లాంటివారు అని చెప్పుకొచ్చారు. హైదరాబాదులో కరెంటు బొత్స కట్టలేదు అన్న ప్రశ్నపై స్పందిస్తూ కొందరు గురించి తనను అడగొద్దు అని పేర్కొన్నారు. తెలంగాణలో కెసిఆర్ పాలన బాగుందని దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలా వద్దా అనే దాని గురించి చెప్పడానికి తన వద్ద ఎలాంటి ఆరోపణలు లేదని బండ్లగణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.