నవంబర్ మూడవ తారీకున దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతిరోజు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు టిఆర్ఎస్ బిజెపి నాయకులు. మండలాలు గ్రామాలు వారీగా వివరాలు తప్పించుకుని ఎవరికి వారు విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల దృష్టి మొత్తం మెజార్టీ పై ఉన్నట్లు సమాచారం. పైగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన మూడు ఉప ఎన్నికలలో ఓటమి లేకపోవడంతో… దుబ్బాకలో అది రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. సానుభూతి, అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు టిఆర్ఎస్ పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు. మొదటినుంచి సీరియస్ గా తీసుకుంది టిఆర్ఎస్. పైగా ఈ ప్రాంతంపై ముందు నుండి పట్టు ఉండటంతో హరీష్ రావు అన్ని తానే ముందుండి నడిపించారు.
ఎన్నికల ప్రచారం సమయంలో భారీ మెజార్టీతో గెలుస్తామని చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు ఇంకా కట్టుబడే ఉన్నారు. గ్రౌండ్ నుంచి పక్కా సమాచారం ఉండటంతోనే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ దీమా గా ఉన్నట్లు కేడర్ అనుకుంటుంది. మరోవైపు బీజేపీ లెక్కలు బీజేపీ వి. మరోపక్క పోలింగ్ శాతం 75 దాటడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రభావం ఓటర్లపై పడినట్లు బిజెపి కూడా గెలుపుపై ధీమా గా ఉన్నట్లు విజయ అవకాశాలు మెరుగుపడ్డాయి అని అంచనాకు వస్తున్నారట నాయకులు.
ఇదే క్రమంలో ఉపఎన్నిక సెంటిమెంట్ అమ్మకి కూడా కలిసి వస్తుందని కమలనాథులు కూడా భావిస్తున్నారు. గతంలో మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటి టిఆర్ఎస్ పార్టీ తో బిజెపికి బలంగా ఉన్న తరుణంలో… బిజెపి ఆ ఉప ఎన్నికలలో గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు సేమ్ అదే వాతావరణం దుబ్బాకలో కూడా కనిపించడంతో గెలిచే ఛాన్స్ ఉన్నాయ్ అని బిజెపి భావిస్తోంది. మరి ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో, బిజెపి ఆశలు ఫలిస్తాయో ఈ నెల 10 వరకు వేచి చూడాల్సిందే.