దేశంలో కరోనా రికవరీ రేటు 70 శాతానికి పెరిగిందని, అదే రీతిలో దేశంలో తొలిసారిగా డెకరేట్ 2 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలియజేశారు. దేశంలో మరణాల రేటు రెండు శాతానికి పడిపోయింది, ఇది చాలా గుడ్ న్యూస్. సగానికి సగం మరణాల రేటు పడి పోవటం అనేది మామూలు విషయం కాదు అని పేర్కొన్నారు.
కరోనా టెస్టులు అలాగే కరోనా ట్రీట్మెంట్ వలన దేశంలో రికవరీ రేటు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఇదే రీతిలో హాస్పిటల్స్ లో మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వటంపై వైద్యులు దృష్టిపెట్టాలని తెలిపింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులను సరైన టైంలో హాస్పిటల్ లో తరలించేలా ప్రభుత్వాలు పని చేయాలని పేర్కొంది.
ఆ విధంగా చేయడం వల్ల బాధితుడికి సరైన టైంలో ఇవ్వటం వల్ల… విషయం పెద్దది కాకుండా అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని రాజేష్ భూషణ్ తెలిపారు. దేశంలో వారం రోజుల్లో 2.5 కోట్ల కరోనా టెస్టులు చేసినట్లు తెలిపారు. దీంతో 15 లక్షల 83 వేల 489 రికవరీ కాగా గత 24 గంటలలో 47,746 మంది పూర్తిగా కోలుకున్నట్టు డిశ్చార్జ్ అయినట్లు స్పష్టం చేశారు.