Israel: గత కొన్ని రోజుల నుండి ఇజ్రాయిల్ హమాస్ టెర్రరిస్టుల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పౌరులు నివసించే ఇళ్లను టార్గెట్ చేసుకుని.. భారీగా రాకెట్లు వదులుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయేల్ … రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్… ఉగ్రవాదుల రాకెట్లను తిప్పికొడుతూ ఉంది. చాలా రాకెట్లని గాలిలోనే నిర్వీర్యం చేసి.. ఇజ్రాయిల్ దేశం లో ఎవరికి నష్టం జరగకుండా ఐరన్ డోమ్.. పనితనం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ క్రమంలో కొన్ని రాకెట్లను అదుపుచేయలేని పరిస్థితి ఉండటంతో నేరుగా ఉగ్రవాదులు ఉపయోగించిన రాకెట్లు ఇజ్రాయేల్ ఇళ్లపై.. అపార్ట్మెంట్ల పై పడటంతో కొంత మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించడం.. మరికొంతమంది గాయాలు పలు కావడం జరిగింది.
దీంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రంగంలోకి దిగి ఉగ్రవాదులు ఎక్కడినుండి అయితే రాకెట్లు ప్రయోగిస్తున్నారు ఆ స్థలాలను కనిపెట్టి… రివెంజ్ తీర్చుకుంటుంది. ఎక్కువగా టెర్రరిస్టులు గాజా ప్రాంతం నుండి సొరంగాల ద్వారా దాడి చేస్తూ ఉండటంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దళాలు… ఉగ్రవాదులు ఎక్కడి నుండి అయితే.. రాకెట్ల దాడి చేస్తున్నారో ఆ ప్రాంతంలో 160 సొరంగాలను ధ్వంసం చేసి చాలామంది టెర్రరిస్టులను అంతం చేసింది. సముద్ర మార్గం ద్వారా అదేవిధంగా వాయు మార్గం ద్వారా… అండర్ గ్రౌండ్ ద్వారా… త్రిముఖ వ్యూహంతో ఇజ్రాయెల్ దళాలు ఉగ్రవాదులపై దాడులకు పాల్పడటం తో…హమాస్ కీలక టెర్రరిస్టులు మరణించడం జరిగింది.
అయినాగాని చివరి హమాస్ టెర్రరిస్టు చనిపోయే వరకు తమ దాడి జరుగుతుందని ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తమ దేశ పౌరులు సురక్షితం.. , ఇంకా టెర్రరిస్టులు ఎవ్వరు లేరు.. అని నిర్ధారణ వచ్చేవరకు దాడులు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. మరో పక్క ఇజ్రాయేల్ చేస్తున్న దాడులను పాకిస్తాన్ అదేవిధంగా టర్కీ ఖండిస్తూ ఉన్నాయి. పాలస్తీనా ప్రాంతానికి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయిల్ పై రివెంజ్ తీర్చుకోవడానికి కూడా అవి రెడీ అవుతున్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. మరోపక్క ఐక్యరాజ్యసమితి మరికొన్ని దేశాలు… సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోండి అని తెలుపుతున్నాయి.