అమరావతి: కేశినేని కార్గో క్యారియర్స్కు కెనరా బ్యాంకులో ఉన్న రుణ బకాయి మొత్తాన్ని కేశినేని నానీ క్లియర్ చేసి పివిపికి సవాల్ విసిరారు.
కేశినేని కార్గో సంస్థ ఆస్తుల స్వాధీనానికి కెనరా బ్యాంకు నోటీసు జారీ చేసిన నేపథ్యంలో విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నానిపై వైసిపి పార్లమెంట్ సభ్యుడు పొట్లూరి వరప్రసాద్ విమర్శలతో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రెండు రోజుల వ్యవధిలోనే కేశినేని కార్గో యాజమాన్యం రెండు కోట్ల 63లక్షలు చెల్లించగా బ్యాంకు రసీదును కేశినేని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తమ నాయకుడు బ్యాంకుకు ఉన్న బాకీ చెల్లించారు, మీరు ఎప్పుడు చెల్లిస్తారంటూ పివిపిని ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. కెనరా బ్యాంకుల నోటీసులపై కేశినేని, పివిపిల మధ్య సోషల్ మీడియాలో పోరు జరిగిన విషయం విదితమే
అయ్య పొట్లూరి వీర ప్రసాద్ @PrasadVPotluriగారు బెజవాడలో పుట్టిన మా దమ్ము ఏంటో చూపించాము. మరి మీదమ్ము ఎంటో చూపించండి.
మన ఎదుట ఉన్నది ఎలాంటి వాళ్ళు అయినా మర్యాదగా మాట్లాడాలి అనీ మాకు మా @kesineni_nani అన్న నేర్పించారు. ఆయన మాటకు కట్టుబడి మిమ్మలి కూడా గౌరవిస్తున్నాం.@ncbn @ysjagan pic.twitter.com/mTLvlGjkuA— hemanth katragadda (@srihemanth2) August 7, 2019