దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాత్మరణంతో దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలలో సత్తా చాటడానికి తెలంగాణలో ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో అందరిని టెన్షన్ పుట్టించే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు ఆ పార్టీ నేతలే బ్లాక్ మెయిలింగ్ తరహాలో రాజకీయాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే జరగబోయే ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్యను ప్రకటించాలని టిఆర్ఎస్ పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు.
కానీ సీనియర్ నేత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. తనకు తప్ప ఉపఎన్నిక టికెట్ మరెవరికీ ఇచ్చిన ఊరుకునే ప్రసక్తి లేదు అన్నట్టుగా ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టాక్. అంతేకాకుండా తానే అభ్యర్థి అని తాను ప్రకటించుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తా అంటూ శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారట.
ఇటువంటి తరుణంలో రామలింగారెడ్డి భార్య సుజాత పేరును కెసిఆర్ డైలమాలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ప్రకటిస్తే శ్రీనివాసరెడ్డి వర్గం కచ్చితంగా అడ్డు పడుతుంది అని భావిస్తున్నారట. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఆఫర్ ఇద్దామని టిఆర్ఎస్ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ శ్రీనివాస్ రెడ్డి మాత్రం తనకు టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టికెట్ ఇవ్వకుంటే అదే టైములో ఒకవేళ బీజేపీ ఆఫర్ ఇస్తే ఆ పార్టీ లోకి వెళ్లి పోవాలనే ఆలోచనలో శ్రీనివాస రెడ్డి ఉన్నట్లు టాక్. మరోపక్క బీజేపీ మాత్రం జరగబోయే ఉప ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని శ్రీనివాసరెడ్డి వస్తే టికెట్ ఇవ్వడానికి అంగీకారం గానే ఉన్నట్లు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.