YS Jagan Mahesh: సినిమా టికెట్ ధర గురించి ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు తగ్గించడంతో… టాలీవుడ్ అగ్రహీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు.. కంగారు పడిపోయారు. ఈ సమయంలో కొంతమంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ధైర్యం చేసి ముందుకు వచ్చి.. టికెట్ ధర గురించి వైసిపి మంత్రులతో చర్చలు జరపడం జరిగింది. మరి కొంతమంది ఇండస్ట్రీకి చెందిన హీరోలు సోషల్ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ సినిమా థియేటర్ల వ్యాపారం కంటే.. పక్కనే ఉండే పచారి షాప్ వ్యాపారం బాగుందని.. సెటైర్లు వేశారు. దీంతో వివాదం మరింత పెద్దదిగా అవుతున్న క్లిష్ట సమయంలో ఇండస్ట్రీ పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై.. చిరంజీవి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి.. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ … ముఖ్యమంత్రి జగన్ తో.. ప్రత్యేకంగా భేటీ అయి ఉన్న సమస్యలకు సామరస్య వాతావరణంలో పరిష్కారం చూపెలా అధ్యక్షత వహించారు.
ఈ తరుణంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ..సీఎం జగన్ తో భేటీ కావటం తెలిసిందే. ఇదే సమావేశానికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇండస్ట్రీ సమస్యల పట్ల సీఎం జగన్ వ్యవహరించిన తీరును అభినందిస్తూ రెండుసార్లు పొగడ్తలతో ముంచెత్తారు. మొదటిసారి సమావేశమైన అనంతరం మీడియా సమావేశం వద్ద మాట్లాడుతూ.. ఇండస్ట్రీ సమస్యల పట్ల చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం.. సోషల్ మీడియాలో స్పందించిన మహేష్ సీఎం జగన్ ని మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు.
సినిమా టికెట్ ఎంట్రీ సమస్యల పట్ల ఫుల్ క్లారిటీ తో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు అని కొనియాడారు. స్పష్టమైన అవగాహనతో ఉన్నారని కచ్చితంగా పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆశాభావం తనకు ఉందని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో చిరంజీవి పెద్దరికం వహించి.. సమస్యను చాలా సామరస్య వాతావరణంలో పరిష్కరించే దిశగా ముందుండి నడిపించారని పొగిడారు. ఇక ఇదే సమయంలో వైసీపీ మంత్రి పేర్ని నాని అందించిన సహకారం కూడా మరువలేనిది అని మహేష్ కొనియాడారు. ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ బాబు నేరుగా వైయస్ జగన్ తో భేటీ కావడంతో సోషల్ మీడియాలో జగన్ మహేష్ ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.