వైసీపీలో ఎమ్మెల్సీగా మొన్నటి వరకు కొనసాగుతూ శాసన మండలిలో సభ్యులుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఇద్దరు ఇటీవల రాజ్యసభ ఎన్నిక కావడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీ కాలం కేవలం ఆరు నెలలే ఉండటంతో ఆ స్థానానికి ఎన్నికలు జరగడం లేదు. కానీ మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ స్థానానికి తాజాగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక సంచలనంగా మారింది. తాజాగా ఈ సీటుకు వెలువడిన ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు ఆరో తారీఖున ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే ఆగస్టు 13 వరకు కొనసాగి… అదే చివరి రోజు కావడంతో కౌంటింగ్ పూర్తి కానుంది.
తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో పోలింగ్ అనివార్యమైన పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ పక్కగా పాటిస్తూ పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా జగన్ పాదయాత్రలో మరియు సీట్ల సర్దుబాటు విషయంలో అనేకమందికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తాం అన్నట్లు జగన్ మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా చాలా వరకూ జగన్ బాధ్యతలు అప్ప చెబుతున్న తరుణంలో మోపిదేవి వెంకటరమణ సామాజికవర్గానికి చెందిన వారికి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తారా లేకపోతే ఈ స్థానంలో రీ రీప్లేస్మెంట్ చేసి వేరే వాళ్ళకి కేటాయిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.
జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టైంలో వైసిపి పార్టీ కోసం కీలకంగా పని చేసి ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎమ్మెల్యే టికెట్లు కూడా వదులుకున్న ఆశావాహులు చాలామంది ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ కొంతమంది కీలక నాయకులు ఎమ్మెల్సీ పదవి కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ స్థానం విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఎవరికి అర్థం కావటం లేదు. ఒక్కసారిగా వచ్చిన ఒత్తిడి మేరకు వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీ పదవి బాధ్యతలు అప్పజెప్పడం అన్నది జగన్ ని చాలావరకు ఇబ్బందిపెట్టే స్థితిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క మొదటిసారి టిడిపి పార్టీ ఆవిర్భవించిన తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పూర్తిగా చేతులెత్తేయడం ఇదే తొలిసారి అని అనుకోవచ్చు.