చారిత్రాత్మిక అయోధ్య భూమి పూజకు మరి కొన్ని గంటలే మిగిలిఉంది. యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయానికి కొద్ది గంటల్లో భూమి పూజ జరగబోతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చాలావరకు తుది దశకు చేరుకున్నాయి. అంగరంగ వైభవంగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి ప్రత్యేక జెట్ విమానంలో ఢిల్లీ నుంచి లక్నో కు ప్రధాని మోడీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరుతారు. ఉదయం 10 గంటల 40 నిమిషాలకు ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరి సరిగ్గా పదకొండున్నర గంటలకు అయోధ్యకు చేరుకుంటారు.
ఆ తరువాత ఉదయం 11: 40 నిమిషాలకు హనుమాన్ గర్హి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. పదవ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ప్రపంచాన్ని దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తొలగిపోవాలంటే ప్రధానితో పాటు ఆలయ ప్రధాన పురోహితుడు మహంతి రాజు దాస్ సహా మిగతా అర్చకులు వేదమంత్రాలు చదవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. ఆ తరువాత 12:30 నుంచి 12 40 వరకు శంకుస్థాపన భూమిపూజ జరగనుంది. ఆ తర్వాత 12:45 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుంది. తిరిగి 2:15 గంటలకు మోడీ ఢిల్లీ బయలుదేరనున్నారు.
కరోనా ఎఫెక్ట్ తో పాటు ఉగ్ర ముప్పు ఉండటంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిన వారు మాత్రమే రావాలని తెలిపారు. ఇదిలాఉండగా అయోధ్య రామాలయం భూమి పూజ కోసం రెండు వేల ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టి, 100 నదుల నుంచి తెచ్చిన నీరును శంకుస్థాపన కార్యక్రమంలో వినియోగించ బోతున్నారు.