ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.
స్వల్ప వ్యవధిలోనే వైఎస్ జగన్ రెండు దఫాలుగా ఢిల్లీ వెళ్లడం, మొదటి టూర్లో హోంమంత్రి అమిత్షాతో సమావేశం, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవడం చర్చకు తెరలేపింది. రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇదే టూర్ సందర్భంగా ఇంకో కీలక పరిణామం సంభవించింది.
ప్రధానమంత్రితో సమావేశంలో …
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు సమచారం.
మోదీ ఆఫీసు ఎంట్రీతో సీన్
ఈ పర్యటనలో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకులు జీర్ణించుకోలేని పరిస్థితి జరిగిందని పలువురు అంటున్నారు. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డితో కలిసి సమావేశం అవడం, సుదీర్ఘంగా వివిధ అంశాలు చర్చించడం. అంతేకాకుండా ఈ ఫోటోను ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం ట్వీట్ చేయడం.
విజయసాయిరెడ్డికి షాక్….
గతంలో వివిధ సందర్భాలను ఉటంకిస్తూ వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు టీడీపీ నేతలు, కొందరు వ్యక్తులు ప్రయత్నించారని వైసీపీ వర్గాలు అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేత, పార్టీలో నంబర్2 అనే పేరున్న ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ రథసారథి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితులు మారిపోయాయనే ప్రచారం పెట్టారు. ఒక సందర్భంలో జరిగిన ఘటనను ఈ విషయంలో తమ పార్టీలో గగ్గోలు అన్నట్లుగా మార్చి కొన్ని మీడియా సంస్థల్లో ప్రముఖంగా చెప్పారని గుర్తు చేశారని వెల్లడించారు. అయితే, ఈ ప్రచారం చేసిన వారికి షాక్ ఇచ్చేలా తాజాగా సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఉందని చెప్తున్నారు. విజయసాయిరెడ్డితో కలిసి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వైఎస్ జగన్ భేటీ అవడం, సుదీర్ఘంగా చర్చించడం బట్టి సదరు వ్యక్తులు షాక్ కు గురవుతున్నారని అంటున్నారు. విజయసాయిరెడ్డికి సీఎం జగన్ షాక్ అని సదరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటారా అంటూ ఎద్దేవా చేశారు.