చైనా పాక్ ఆర్థిక కారిడార్ లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) లో “నీలం జీలం” నది పై కొన్ని విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చైనాతో పాకిస్తాన్ ఈ ఏడాది జూన్ మాసంలో ఒప్పందం చేసుకుంది. దీంతో పీవోకేలో చైనాకు వ్యతిరేకంగా ఉద్యమం రాజుకుంది. చైనా కంపెనీలు కట్టబోతున్న డ్యాంలను పీవోకే ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముజాఫర్ బాధ్ లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘నదులను కాపాడుకుందాం… ముజాఫర్ బాధ్ ను కాపాడుకుందాం అంటూ నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా చైనా దేశానికి చెందిన జెండాలను తగలబెట్టారు.
ఒకానొక సమయంలో “నీలం జీలం” నది నీళ్ళతో కలకలలాడుతూ పరవళ్లు తొక్కేది, స్థానికులు తాగునీటి అవసరాలు తీరేవి. కానీ ఇప్పుడు మురికి నీరుగా నది జలం మారిందని పీవోకే కు చెందిన సామాజికవేత్త డాక్టర్ అంజద్ మీర్జా ఆవేదన వ్యక్తం చేశారు. చైనా, పాకిస్థాన్ దేశాలు ఎకనామిక్ కారిడార్ అంటూ ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు అంటూ ఆయన ఆరోపించారు.
మా బాధ చాలా సంవత్సరాల నుండి తెలియజేస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదని మీర్జా వాపోయారు. చైనా కంపెనీలు తమ డ్యాంల నిర్మాణం కోసం నది నీళ్లను మళ్లించడంతో… ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఇలా చేస్తే పి ఓకే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది పైగా పేదరికంలో కూరుకు పోతున్నాం అంటూ అంజద్ ఆందోళన వ్యక్తం చేశారు.