ఇటీవల ఏపీలో వరుసగా దళితులపై దాడులు జరుగుతున్న తరుణంలో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తూర్పుగోదావరి ప్రకాశం జిల్లాలో జరిగిన దాడులలో ప్రకాశం జిల్లాకు చెందిన కిరణ్ అనే దళిత వ్యక్తి చనిపోగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం కి చెందిన వరప్రసాద్ కి శిరోముండనం విషయంలో తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా తనకి సమాజంలో బతకడం ఇష్టం లేదని నక్సలైట్ లో కలిసిపోవాలని ఉందని…. శిరోముండనం బాధితుడు వరప్రసాద్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కి లెటర్ రాశారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్రపతి కార్యాలయం వెంటనే బాధితుడు వరప్రసాద్ కి అండగా ఏపీ జీఏడీలో అసిస్టెంట్ సెక్రటరీ గా పనిచేస్తున్న జనార్ధన్ బాబును నియమించడం జరిగింది.
కేసులో తనకు న్యాయం జరగడం లేదని లెటర్ లో వరప్రసాద్ కోరటంతో…. రాష్ట్రపతి కార్యాలయం జనార్ధన్ బాబు తోడుగా ఉంటారని కేసు విషయంలో సహకరిస్తారని వర ప్రసాద్ కి అండగా ప్రత్యేక అధికారిగా నియమించారు. అయితే ఈ విషయంలో శిరోముండనం బాధితుడికి వ్యతిరేకంగా మంత్రి విశ్వరూప్ తెర వెనకాల కథలు నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రత్యేక అధికారి జనార్ధన్ బాబు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలను పెద్దగా పట్టించుకోనట్లు తేలడంతో వరప్రసాద్ మళ్లీ ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం దృష్టికి తీసుకు వెళ్లారట. దీంతో వెంటనే రాష్ట్రపతి కార్యాలయం ఏపీ ప్రభుత్వం పై సీరియస్ అయినట్లు, ఈ కేసు ఫైల్ కేంద్ర సామాజిక న్యాయ శాఖకు బదిలీ చేసినట్లు సమాచారం.