వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డికి మరో సారి రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో అవకాశం లభించింది. గత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీ విరమణకు ముందు ఏర్పాటు చేసిన వైస్ చైర్మన్ ప్యానల్ లో విజయసాయిరెడ్డికి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. వెంకయ్య నాయుడు పదవీ విరమణ తర్వాత ఉప రాష్ట్రపతి (రాజ్యసభ చైర్మన్) గా ఎన్నికైన జగదీప్ ధన్కర్ కొత్త వైస్ చైర్మన్ ప్యానల్ రూపొందించారు. ఈ నెల 7వ తేదీ (బుధవారం) నుండి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మొత్తం ఎనిమిది మందితో వైస్ చైర్మన్ ప్యానల్ పునర్వ్యవస్థీకరించారు.
ఆ జాబితాలో విజయసాయిరెడ్డితో పాటు అస్సాంకు చెందిన భువనేశ్వర్ కవిత, కర్ణాటక నుండి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ ఎల్ హనుమంతయ్య, తమిళనాడు డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ, పశ్చిమ బెంగాల్ కు చెందిన టీఎంసీ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్, ఒడిసా బీజూ జనతాదళ్ సభ్యుడు డాక్టర్ సుస్మిత్ పాత్రో, చత్తీస్ ఘడ్ బీజేపీ సభ్యురాలు సరోజ్ పాండే, యూపీ బీజేపీ సభ్యుడు సురేంద్ర సింగ్ నాగర్ ఉన్నారు. ఈ మేరకు జాబితాను రాజ్యసభ సచివాలయం విడుదల చేసింది.
రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ లో మరో సారి తనకు అవకాశం లభించడం పట్ల విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు అవకాశం కల్పించినందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు విజయసాయి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తనతో పాటు జాబితాలో ఉన్న మిగిలిన సభ్యులకు విజయసాయి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో ఉన్న సభ్యులు సభాపతి స్థానంలో కూర్చుని సభను నిర్వహిస్తారు. గత సమావేశాల్లో విజయసాయిరెడ్డి సభాపతి స్థానంలో కూర్చుని సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. విజయసాయికి మరో సారి వైస్ చైర్మన్ ప్యానల్ లో అవకాశం లభించడం పట్ల ఆయన సన్నిహితులు, మిత్రులు, పార్టీ నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ రెబల్ ఎంపి రఘురామ షాకింగ్ ప్రతిపాదన
I wholeheartedly thank Hon’ble Vice President Shri @jdhankhar1 Ji for including me on the panel of Vice-chairmen. I congratulate all members and assure the fullest cooperation in the functioning of the house.@VPSecretariat pic.twitter.com/6i7cc9oLlV
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 5, 2022