ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గుడివాడ నియోజకవర్గం మొదటిలో టిడిపి పార్టీకి కంచుకోటగా వుండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు టిడిపి జెండా యే ఎగురుతూ ఉండేది. టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కూడా ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. చాలావరకు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం కి చెందిన నేతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గాలలో గుడివాడ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గాన్ని టిడిపి పార్టీలో ఉండే పెద్దలు చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంటారు.
కాగా కొడాలి నాని ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తిగా నియోజకవర్గం పై పట్టు సాధించడంతో రాజకీయ లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. వైయస్ చనిపోయిన తర్వాత టిడిపి పార్టీ నుండి బయటకు వచ్చేసి జగన్ వెంట నడుస్తూ అప్పటినుండి ఇప్పటివరకు ఆయన వెంటే కొడాలి నాని ఉన్నారు. చౌదరి వర్గమైన గాని కొడాలి నాని అటువంటివి పక్కన బెట్టి జగన్ వెంట నమ్మినబంటుగా ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. మరోపక్క అసెంబ్లీ లో జగన్ కూడా నేను నమ్మిన వారి లో కొడాలి నాని ఒకరు అని కూడా చెప్పడం జరిగింది. అటువంటి సాన్నిహిత్యం వీరిద్దరి మధ్య ఉంది.
పరిస్థితి ఇలా ఉండగా గుడివాడ నియోజకవర్గంలో చౌదరి ల ప్రోద్బలం ఎక్కువ ఉన్న కానీ ప్రస్తుతం రాష్ట్రంలో వైసిపి పార్టీ అధికారంలోకి రావడంతో చౌదరిగారి అడ్డాలో అనగా గుడివాడ నియోజకవర్గంలో రెడ్ల ఆధిపత్యం పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలో రెడ్డి వర్గం ప్రజలు చాలా తక్కువ ఉన్నాగాని గుడివాడలో రెడ్ల హవా నడుస్తున్నట్లు టాక్ వస్తుంది. తాజాగా నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కొండాలమ్మ గుడి చైర్మన్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రామిరెడ్డి కి దక్కడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మొదటి నుండి కనుమూరి రామిరెడ్డి దానికి మద్దతు గా ఉంటూ వైసిపి పార్టీ లో కీలక నాయకుడిగా నియోజకవర్గంలో రాణించడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే నేత కావడంతో ఆయనకు ఈ పదవి వచ్చినట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే చౌదరిగారి అడ్డాలో చాలావరకు రెడ్ల ఆధిపత్యం నడుస్తున్నట్లు టాక్ వస్తోంది.