అమరావతి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు అనేది నానుడి. అయితే నాయకులు పార్టీలు మారే సమయంలో వారు చేరనున్న పార్టీపై గతంలో చేసిన విమర్శలను తెరపైకి తీసుకురావడం. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం సహజమే.
అందులో భాగంగా గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో వంశీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘కడుపుకు అన్నం తినే వాడు ఎవరూ వైసిపిలో ఉండరు, మేమంతా అన్నం తింటాం, వారు అన్నం తింటారో లేదో వారు చెప్పాలి’ అంటూ వంశీ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా వైసిపిపైనా, ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలను సైతం చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవ్వరు వైసీపీలో చేరారు #TDPMLA Vallabhaneni Sensational Comments On AP CM #YSJaganMohanReddy #ABNTelugu for full video: https://t.co/7eY5bQMlA5 pic.twitter.com/eW1l0xzsCr
— ABN Telugu (@abntelugutv) October 26, 2019