అమరావతి: అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుంచుకోవాలని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టిడిపి నాయకులకు చెందిన మూడు ఇళ్లను అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేయడంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వ చర్యలను ఖండించారు.
కూల్చడాలే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వ పాలన సాగుతోందని లోకేష్ విమర్శించారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టిడిపి నాయకులకు చెందిన మూడు ఇళ్లను అక్రమ కట్టడాల పేరుతో కూల్చేశారని లోకేష్ పేర్కొన్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం వైసిపి దౌర్జన్యాలకు అండగా నిలుస్తుండటం దురదృష్టకరమని లోకేష్ వ్యాఖ్యానించారు. కక్ష సాధింపులు, కూల్చడాలు, ఇదేనా జగన్కు చేతనైన పరిపాలన అంటూ లోకేష్ ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని లోకేష్ హితవు పలికారు.
కూల్చడాలే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వ పాలన సాగుతోంది. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో తెదేపా నాయకులకు చెందిన 3 ఇళ్లను అక్రమ కట్టడాల పేరుతో కూల్చేశారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం వైకాపా దౌర్జన్యాలకు అండగా నిలుస్తుండటం దురదృష్టకరం. pic.twitter.com/FsJ0YW1hfu
— Lokesh Nara (@naralokesh) August 14, 2019