తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలావరకు తగ్గుముఖం పట్టింది. మొదటిలో వైరస్ ఎంత ప్రమాదకరంగా మారినా కానీ ఖచ్చితంగా ఎదుర్కొంటామని కేసిఆర్ పెద్ద పెద్ద డైలాగులు వేశారు. అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో ప్రతిరోజు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పేట్టని విధంగా మీడియా సమావేశాలు పెట్టి మరీ కరోనా తో ఫుట్ బాల్ ఆడుకుంటా అన్నట్టుగా కేసిఆర్ వ్యవహరించారు. తీరా కొన్ని రోజులకి లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే…. సీన్ మొత్తం మారిపోయింది.
తెలంగాణ రాష్ట్ర పోలీసులకు రాజకీయ నాయకులకు కరోనా చికిత్స అందిస్తున్న వైద్యులకు విపరీతంగా కరోనా సోకిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పరిస్థితి అదుపు చేయలేక తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకానొక దశలో చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. మరోపక్క ప్రతిపక్షాలు, న్యాయస్థానాల నుండి అదేరీతిలో సామాన్యుల నుండి విమర్శలు ఒక్కసారిగా రావడంతో… కరోనా చికిత్స విషయంలో అదే విధంగా నిర్ధారణ పరీక్షల విషయంలో ఇటీవల చర్యలు చేపట్టి చాలా వరకు కంట్రోల్ లోకి తీసుకు రావడం జరిగింది.
ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ లో కేసుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతున్న నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియా సమావేశం పెట్టి తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ చివరికి తెలంగాణ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు.
అదే రీతిలో కరోనా చికిత్స అందిస్తున్న కొన్ని హాస్పిటల్స్ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య సదుపాయాలు కలిగించే రీతిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు.