హైదరాబాద్, జనవరి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్తో తెలంగాణా రాష్ర్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం 12. 30గంటలకు భేటీ కానున్నారు. హైదరాబాద్లోని వైఎస్ జగన్ నివాసం లోటస్ పాండ్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతను తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఆయన తనయుడు కలసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపైన చర్చించనున్నారని వైసిపి ఎంపి విజయసారిరెడ్డి తెలిపారు.
భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు.
ఈ భేటీ రాజకీయంగా రెండు తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
previous post
next post