హైదరాబాద్: బోధన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ గురువారం నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంసమయ్యింది. షకీల్ కలిసిన విషయాన్ని ఎంపి అరవింద్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపి అరవింద్ను షకీల్ శాలువాతో సత్కరించి బొకె అందజేశారు.
మంత్రి పదవి దక్కకపోవడంతో షకీల్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ ముఖ్యనేత కవితకు సన్నిహితుడుగా గుర్తింపు తెచ్చుకున్న షకీల్ నిజామాబాద్ బిజెపి ఎంపి అరవింద్ను కలవడం టిఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గురువారం ఆయన పార్టీపై సంచలన వ్యాఖ్యలను కూడా చేశారు. ఎంఐఎం చెప్పినట్లు టిఆర్ఎస్ నడుచుకొంటుందంటూ షకీల్ ఆరోపించారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు గెలిచానన్నారు.